- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
'పేదలకు అండ సోనియా గాంధీ'
దిశ, కొత్తగూడ : తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ తెలంగాణ తల్లి అని కొత్తగూడ మండల జడ్పీటీసీ పుల్సాం పుష్పలత శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కొత్తగూడ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం గుంజేడు ముసలమ్మ జాతరలో ప్రతేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ కార్యదర్శి చల్లా నారాయణరెడ్డి మాట్లాడుతూ ఆరు దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసిన మహనీయురాలు సోనియా గాంధీ అని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారని, ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినా సోనియా తృణప్రాయంగా వదిలిపెట్టారని చెప్పారు.
ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చి పేదలకు అండగా నిలిచారన్నారు. దేశంలో ఎన్నో చట్టాలు తీసుకొచ్చిన ఘనత సోనియా గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయ రూప్ సింగ్, కొత్తగూడ సర్పంచ్ మల్లెల రణధీర్, లావణ్య వెంకన్న జిల్లా నాయకులు కాడబోయిన జంపయ్య వైస్ ఎంపీపీ, బూర్క పుష్పలత నరేందర్ ఎంపీటీసీ, ముస్కు వెంకన్న కిసాన్ సెల్ మండల అధ్యక్షులు, బిట్ల శ్రీనివాస్ మండల ప్రధాన కార్యదర్శి, బొల్లు రమేష్, రాజాం సారంగం ,వెలుదండి వేణు బిసి సెల్ మండల అధ్యక్షులు, ఉళ్లేంగుల రమేష్ కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు, గుమ్మడి సమ్మయ్య, మాలన, నోముల ప్రశాంత్ యాదవ్, ఇర్యా, మెకానిక్ కృష్ణ , వెంకన్న , కడ్దూరి కుమారస్వామి, కాట్రాజు భిక్షపతి బిసి సెల్ మండల నాయకులు, రాజాం సాంబయ్య, దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.